“ప్రజలు మస్జిదుల గురించి పోటీ పడి గొప్పలు చెప్పుకోనంత వరకు ప్రళయ ఘడియ రాదు.”

“ప్రజలు మస్జిదుల గురించి పోటీ పడి గొప్పలు చెప్పుకోనంత వరకు ప్రళయ ఘడియ రాదు.”

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రజలు మస్జిదుల గురించి పోటీ పడి గొప్పలు చెప్పుకోనంత వరకు ప్రళయ ఘడియ రాదు.”

[ప్రామాణికమైన హదీథు] [అబూ దావూద్, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పునరుత్థాన దినం చేరువకావడం మరియు ప్రపంచము ఒక ముగింపుకు రావడం యొక్క సంకేతాలలో - ప్రజలు తమ మస్జిదుల అలంకరణ గురించి గొప్పలు చెప్పుకోవడం లేదా కేవలం అల్లాహ్’ను స్మరించుట కొరకు మాత్రమే నిర్మించిన మస్జుదుల లోపల వారి ప్రాపంచిక వ్యవహారాల గురించి గొప్పలు చెప్పుకోవడం ఒకటి.

فوائد الحديث

మస్జిదుల గురించి గొప్పలు చెప్పుకోవడం నిషేధించబడింది మరియు ఇది ఆమోదయోగ్యం కాని చర్య, ఎందుకంటే అది అల్లాహ్ కొరకు చేయబడిన ఆచరణ కాదు.

మస్జిదులకు రంగులు వేయడం, వన్నెలను అద్దకం చేయడం, నగిషీలు చెక్కడం మరియు రాతలతో అలంకరించడం నిషేధించబడింది, ఎందుకంటే అవి ఆరాధకులు వాటిని చూసినప్పుడు వారి దృష్టి ఆరాధన నుండి మరలి పోయేలా చెస్తాయి.

అల్-సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథ్, సత్యాన్ని ప్రస్తుత వాస్తవికత ద్వారా ధృవీకరించిన వాటిలో ఒకటి, మరియు ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క స్పష్టమైన అద్భుతాలలో ఒకటి.

التصنيفات

మస్జిదుల ఆదేశాలు