వాడి ‘ఖింజబ్’ అని పిలువబడే షైతాను. నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, వెంటనే (అ’ఊజు బిల్లాహ్ అని) అల్లాహ్…

వాడి ‘ఖింజబ్’ అని పిలువబడే షైతాను. నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, వెంటనే (అ’ఊజు బిల్లాహ్ అని) అల్లాహ్ యొక్క శరణు కోరుకో, మరియు నీ ఎడమ వైపునకు

ఉస్మాన్ ఇబ్న్ అబీ అల్ ఆస్ రజియల్లాహు అన్హు తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి ఇలా అన్నారని ఉల్లేఖిస్తున్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నిశ్చయంగా షైతాన్ నాకూ, నా సలాహ్’కు (నమాజుకు), మరియు (నమాజులో) నా ఖుర్’ఆన్ పఠనానికి మధ్య వస్తున్నాడు, నా ఏకాగ్రతను భంగపరుస్తున్నాడు.” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వాడి ‘ఖింజబ్’ అని పిలువబడే షైతాను. నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, వెంటనే (అ’ఊజు బిల్లాహ్ అని) అల్లాహ్ యొక్క శరణు కోరుకో, మరియు నీ ఎడమ వైపునకు మూడు సార్లు (ప్రతీకాత్మకంగా) ఉమ్మివేయి.” నేను అలాగే చేసాను. అల్లాహ్ వాడిని నా నుండి దూరం చేసినాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఉస్మాన్ బిన్ అబీ అల్ ఆస్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా! నాకు నా సలాహ్’కు (నమాజుకు) మధ్య షైతాన్ వచ్చి నన్ను నమాజులో మనసు సంపూర్ణంగా లగ్నం చేయకుండా చేస్తున్నాడు, నా ఖుర్’ఆన్ పఠనంలో నన్ను గందరగోళానికి గురి చేస్తున్నాడు; అందులో (నేను సరిగానే పఠిస్తున్నానా అనే) సందేహాన్ని కలుగజేస్తున్నాడు” అన్నారు. అతనితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వాడు “ఖిన్’జబ్” అని పిలువబడే షైతాను. ఒకవేళ నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, అల్లాహ్ (యొక్క స్మరణ) నే గట్టిగా పట్టుకుని ఉండు, మరియు ఆయన శరణు వేడుకో. మరియు నీ ఎడమ చేయి వైపునకు మూడు సార్లు కొద్దికొద్దిగా ఉమ్మి వేయి.” ఉథ్మాన్ ఇలా అన్నారు “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన విధంగానే నేను చేసాను. అల్లాహ్ వాడిని (షైతానును) నా నుండి దూరం చేసినాడు.

فوائد الحديث

ఈ హదీసు ద్వారా – సలాహ్’లో (నమాజులో) వినయము మరియు హృదయాన్ని లగ్నం చేసి ఆచరించుట యొక్క ప్రాధాన్యత తెలుస్తునది. అలాగే షైతాను నమాజులో పలురకాలుగా ధ్యానాన్ని మళ్ళించడానికి, సందేహాలు రేకెత్తించడానికి మరియు గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని తెలుస్తున్నది.

నమాజులో ఉండగా షైతాను మనసులో పలురకాల ఆలోచనలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తే వెంటనే అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, అలాగే (ప్రతీకాత్మకంగా) ఎడమచేతి వైపునకు మూడు సార్లు ఉమ్మి వేయాలి.

తమకు ఎదురైన ఏ పరిస్థితికైనా, ఏ సమస్య లేక సందేహానికైనా సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి చేరి వారి ముందు ఉంచేవారు. వారు దానికి పరిష్కారాన్ని చూపేవారు.

అంతిమ దినపు ఆలోచనతోనే సహబాల హృదయాలు ఎప్పుడూ సజీవంగా ఉండేవి.

التصنيفات

జిన్నులు, నమాజ్ పద్దతి, జిక్ర్ ప్రాముఖ్యతలు, సాధారణ విషయాల దుఆలు