إعدادات العرض
వారిలోని పుణ్యాత్ములు లేక దైవదాసులు చనిపోయినప్పుడు వారి సమాధుల పైన ఆలయాలు నిర్మించి వారి చిత్రాలు చేసేవారు…
వారిలోని పుణ్యాత్ములు లేక దైవదాసులు చనిపోయినప్పుడు వారి సమాధుల పైన ఆలయాలు నిర్మించి వారి చిత్రాలు చేసేవారు అవే ఈ చిత్రాలు;అల్లాహ్ వద్ద సృష్టి రాశుల్లో కెల్లా అత్యంత నీచమైన జీవులు వీరు.
ఆయెషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ‘ఉమ్మే సల్మా రజియల్లాహు అన్హా మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో హబ్షా లో ఆమే చూసిన చర్చి గురించి అందులోని చిత్రాల/బొమ్మల గురించి ప్రస్తావించారు,ఆమెను 'మారియా 'అని పిలుస్తారు,అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు తెలుపుతూ’ వారిలోని పుణ్యాత్ములు లేక దైవదాసులు చనిపోయినప్పుడు వారి సమాధులపైనా ఆలయాలు నిర్మించి వారి చిత్రాలు చేసేవారు అవే ఈ చిత్రాలు ,అల్లాహ్ వద్ద సృష్టి రాశుల్లో కెల్లా అత్యంత నీచమైన జీవులు వీరు'అని తెలిపారు.
الترجمة
عربي বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Kurdî Hausa Português മലയാളം Kiswahili မြန်မာ ไทย 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska cs ગુજરાતી አማርኛ Yorùbá සිංහල தமிழ் دری Кыргызча or rw so नेपाली mg roالشرح
‘ఆయేషా (రదీయల్లాహు అన్హా) తెలియజేస్తున్నారు :ఉమ్ము సల్మా(రదీయల్లాహు అన్హా) ఇథియోపియాలో ఉన్నప్పుడు,అక్కడ ఒక చర్చిని చూసారు,అది వివిధ చిత్రాలతో చిత్రీకరించబడింది.ఆమె చూసిన అందమైన పటాలు మరియు చిత్రాల అందం గురించి ఆశ్చర్యంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కి చెప్పారు.ఈ సమస్య యొక్క తీవ్రత మరియు తౌహీద్ ఏకత్వానికి వాటిల్లే ముప్పు కారణంగా,ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనతల పైకెత్తి, వారికి అలాంటి చిత్రాలు ఉనికి లోకి రావడానికి గల కారణాలను వివరించారు. వాటికి వ్యతిరేకంగా తన సమాజాన్ని హెచ్చరిస్తూ, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీరు ప్రస్తావించిన ఈ చిత్రపటాలు వారిలో కొంతమంది పుణ్యపురుషులు,దైవదాసులు చనిపోయిననప్పుడు,వారిసమాధిపై ఒక్కో ఆలయాన్ని నిర్మించారు,అక్కడ వారు ప్రార్ధనలను దైవిక సేవలను నిర్వహించారు,ఈ ఆలయాన్ని ఇలాంటి చిత్రాలతో చిత్రించారు.పిదప దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ చిత్రాలను సృష్టించిన వారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందు అత్యంత హీనమైన సృష్టితాలు అని వివరించారు, ఎందుకంటే అలాంటి వృత్తి బహుదైవారాధనకు షిర్కు కు దారితీస్తుంది.فوائد الحديث
సమాధులపై మస్జిదులు నిర్మించడం లేదా మృత దేహాలను మస్జిదుల్లో సమాధి చేయడం నిషేదము,షిర్కు ద్వారాలను మూయడం మరియు విగ్రహాఆరాధనను పోలిన ఆరాధనను ఖండించడం దీనియొక్క ముఖ్య ఉద్దేశ్యం.
సమాధులపై మస్జిదుల నిర్మాణం మరియు మస్జిదుల్లో చిత్రాలను ప్రతిష్టించడం యూదుల,క్రైస్తవుల చర్య ఎవరైతే ఇలాంటి కార్యాలకు పాల్పడుతాడో అతను వారిని అనుకరించినవాడవుతాడు,మరియు వారు గురయ్యే శిక్షలకు అర్హుడవుతాడు.
సమాధి వద్ద నమాజు చేయడం షిర్కు కు దారిస్తుంది,ఆ సమాధులు మస్జిదుల ఆవరణలో ఉన్నా లేక బయటి ప్రదేశాల్లో ఉన్నా సమానమే!
చిత్రాలను చిత్రించడం అది సజీవులవైనా సరే నిషేధము హరాము
సమాధిపై మస్జిదు నిర్మించి అందులో చిత్రాలను స్థాపించినవాడు,మహోన్నతుడైన అల్లాహ్ సృష్టితాల్లో అత్యంత చెడ్డహీనుడు.
షరీఅతును పూర్తిగా తౌహీద్ కొరకు పరిరక్షించబడినది అందుచేత బహుదైవారాధనకు దారితీసే అన్నీ మార్గాలు మూసివేయబడ్డాయి.
సమాధులపై నిర్మించబడిన మస్జిదుల్లో చేసే నమాజులు ఆమోదించబడవు,ఎందుకంటే దీన్నిమహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్'వారించారు, ఇలా చేసేవాడిని శపించారు,నిషేధము-వ్యాప్తిచేసే కీడు వల్ల నిషేదించబడినది.
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన ఉమ్మత్ యొక్క సన్మార్గం పట్ల అతిజాగ్రత్త వహించేవారు,దానికి సాక్ష్యం :దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మరణశయ్యపై ఉన్నప్పటికి కూడా తన ఉమ్మత్ ను యూదులు మరియు క్రైస్తవులు వారి ప్రవక్తల,పుణ్యపురుషుల పట్ల వ్యవహరించిన చెడు వైఖరి నుండి హెచ్చరించారు.