إعدادات العرض
ఎందుకంటే అతడు ఎన్నడూ “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా పాపములను మన్నించు” అని వేడుకోలేదు” అన్నారు
ఎందుకంటే అతడు ఎన్నడూ “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా పాపములను మన్నించు” అని వేడుకోలేదు” అన్నారు
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను “ఓ రసూలుల్లాహ్! ఇబ్నె జుదాన్ బంధాలను, బాంధవ్యాలను గౌరవించేవాడు, వాటిని నిలిపి ఉంచేవాడు, కొనసాగించేవాడు, మరియు (ఇస్లాం కు పూర్వపు) అఙ్ఞాన కాలములో పేదవారికి అన్నం తినిపించేవాడు. ఇది (ఈ మంచిపనులు) అతనికి ఏమైనా ప్రయోజనాన్ని కలుగజేస్తుందా?” దానికి ఆయన “ఇది అతనికి ఏమీ ప్రయోజనం కలుగజేయదు, ఎందుకంటే అతడు ఎన్నడూ “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా పాపములను మన్నించు” అని వేడుకోలేదు” అన్నారు.
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština ગુજરાતી Yorùbá Nederlands اردو Español Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe Bosanski සිංහල हिन्दी Tiếng Việt Kurdî Hausa മലയാളം Kiswahili ไทย پښتو অসমীয়া Shqip دری Ελληνικά Български Fulfulde ಕನ್ನಡ Кыргызча Lietuvių or Română Kinyarwanda Српски тоҷикӣ O‘zbek नेपाली Moore Oromoo Wolof Soomaali Tagalog Français Azərbaycan Українська bm தமிழ் Deutsch ქართული Português Македонски Magyar فارسی Русский 中文 kmالشرح
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్నె జుదాన్’ను గురించి తెలియ జేస్తున్నారు. ఇస్లాం కు పూర్వం అతడు ఖురైషీ తెగ యొక్క నాయకులలోని ఒక ప్రముఖ నాయకుడు. అతడు కష్టాలలో ఉన్న తన బంధువుల దగ్గరకు స్వయంగా వెళ్ళి వారికి సహాయం చేసేవాడు, పేదలకు అన్నం తినిపించేవాడు. ఇస్లాం ధర్మం తన అనుయాయులను ఆచరించమని ఆదేశించిన ఉత్తమ ఆచరణలను అన్నింటినీ అతడు (ఇస్లాం ధర్మానికి పూర్వం) ఆచరించేవాడు. అయినా అది అంతిమ దినమున అతనికి ఏమాత్రమూ ప్రయోజనం కలిగించదు. ఇది ఎందుకంటే అతడు అల్లాహ్ నందు విశ్వసించలేదు. ఎన్నడూ అతడు “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా తప్పులను, పాపాలను క్షమించు” అని వేడుకోలేదు.فوائد الحديث
ఇందులో ‘విశ్వాసము’ యొక్క ఘనత తెలుస్తున్నది. మరియు (అల్లాహ్ వద్ద) ఆచరణలు ఆమోదయోగ్యం కావడానికి అది (విశ్వాసము) ఒక మూల నియమము అని తెలుస్తున్నది.
ఇక్కడ అవిశ్వాసము యొక్క దుష్పరిణామాల గురించి తెలుస్తున్నది. మరియు అది సత్కార్యములు నిష్ప్రయోజనమై పోవడానికి, వ్యర్థమై పోవడానికి కారణమని తెలుస్తున్నది.
అవిశ్వాసుల సదాచరణలు, సత్కార్యాలు తీర్పు దినమున వారికి ఏమాత్రమూ ప్రయోజనం కలుగ జేయవు, ఎందుకంటే వారు అల్లాహ్ నందు మరియు తీర్పు దినమునందు విశ్వసించలేదు గనుక.
అవిశ్వాసిగా ఉన్న స్థితిలో ఒక వ్యక్తి చేసిన ఆచరణలన్నీ నమోదు చేయబడతాయి. ఒకవేళ అతడు విశ్వాసిగా (ముస్లింగా) మారితే తీర్పు దినమున అతడు వాటి ప్రతిఫలం పొందుతాడు.